బికెఎస్ బిజినెస్ ఐకాన్ అవార్డ్ 2019 విన్నర్
- July 04, 2019
బహ్రెయిన్ కేరళీయ సమాజం (బికెఎస్) బిజినెస్ ఐకాన్ అవార్డ్ని యునీకో మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రహ్మాన్ మొహమ్మద్ జుమా గెలుచుకున్నారు. బికెఎస్ అఫీషియల్స్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కింగ్డమ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎఫైర్స్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హుస్సేన్ మిర్జా ఓ భారీ ఈవెంట్లో ఈ పురస్కారాన్ని అందజేస్తారని, ఈ వెంట్ బికెఎస్ డిజె హాల్లో జరుగుతుందని తెలిపారు. యునీకో అనేది ఇన్స్టాలేషన్, టెస్టింగ్ మరియు కాంట్రాక్టింగ్ కంపెనీ. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు సెక్యూరిటీ ఇంజనీరింగ్ సిస్టమ్స్కి సంబంధించిన సంస్థ ఇది. జుమా నేతీత్వంలో ఈ సంస్థ అద్భుతమైన ప్రగతి సాధించిందని బహ్రెయిన్ కేరళ సమాజం ప్రెసిడెంట్ పివి రాధాకృష్ణ పిళ్ళయ్ చెప్పారు. చాలామంది కేరళీయులకు , ఇతరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నందున కేరళీయ సమాజం జుమాకి రుణపడి వుందని పిళ్ళయ్ అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..