బికెఎస్ బిజినెస్ ఐకాన్ అవార్డ్ 2019 విన్నర్
- July 04, 2019
బహ్రెయిన్ కేరళీయ సమాజం (బికెఎస్) బిజినెస్ ఐకాన్ అవార్డ్ని యునీకో మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రహ్మాన్ మొహమ్మద్ జుమా గెలుచుకున్నారు. బికెఎస్ అఫీషియల్స్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కింగ్డమ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎఫైర్స్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హుస్సేన్ మిర్జా ఓ భారీ ఈవెంట్లో ఈ పురస్కారాన్ని అందజేస్తారని, ఈ వెంట్ బికెఎస్ డిజె హాల్లో జరుగుతుందని తెలిపారు. యునీకో అనేది ఇన్స్టాలేషన్, టెస్టింగ్ మరియు కాంట్రాక్టింగ్ కంపెనీ. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు సెక్యూరిటీ ఇంజనీరింగ్ సిస్టమ్స్కి సంబంధించిన సంస్థ ఇది. జుమా నేతీత్వంలో ఈ సంస్థ అద్భుతమైన ప్రగతి సాధించిందని బహ్రెయిన్ కేరళ సమాజం ప్రెసిడెంట్ పివి రాధాకృష్ణ పిళ్ళయ్ చెప్పారు. చాలామంది కేరళీయులకు , ఇతరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నందున కేరళీయ సమాజం జుమాకి రుణపడి వుందని పిళ్ళయ్ అన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







