యూఏఈలో అగ్ని ప్రమాదం
- July 06, 2019
అబుదాబీ సివిల్ డిఫెన్స్, క్యాపిటల్ ముష్రెక్ ప్రాఆంతంలోని ఓ విల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి 21 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. విల్లా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 9 రెసిడెన్షియల్ యూనిట్స్ వున్నాయి. ఇక్కడే అగ్ని ప్రమాదం జరగగా, 21 మందిని క్షణాల్లో వెకేట్ చేయించగలిగారు అధికారులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ - డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సలెమ్ హాషిమ్ మాట్లాడుతూ, క్షేమంగా బయటపడ్డవారిలో రెండు నెలల చిన్నారి నుంచి 47 ఏళ్ళ వయసుగల వ్యక్తుల వరకు వున్నారని తెలిపారు. పొగ పీల్చడం కారణంగా అస్వస్థతకు గురైనవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా వుండేందుకు ప్రతి ఒక్కరూ సేఫ్టీ నిబంధనల్ని పాటించాలని అల్ హబాషి సూచించారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరుగుతుందని తెలిపారాయన.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







