ఆధార్ ఆన్ ఎరైవల్పై హర్షం వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు
- July 06, 2019
బహ్రెయిన్:కింగ్డమ్లోని భారతీయ వలసదారులంతా 'ఆధార్ ఆన్ ఎరైవల్' ప్రపోజల్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ఎన్నారైలుకు ఆధార్ ఆన్ ఎరైవల్ అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నారైలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఆరు నెలలు వుంటేనే ఆధార్ దక్కుతుందనే నిబంధన ఇప్పటిదాకా అమల్లో వున్న విషయం విదితమే. కాగా, తాజా ప్రపోజల్పై హర్షం వ్యక్తం చేసిన భారతీయ వలసదారుడు రామ్శంకర్ మహేశ్వరన్, ఆధార్ లేకపోవడంతో ఎన్నారైలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్ పొందడం అలాగే చాలా విషయాలకు ఆధార్తో లంకె కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయనీ, కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమకు ఉపశమనం కలిగిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







