ఆధార్ ఆన్ ఎరైవల్పై హర్షం వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు
- July 06, 2019
బహ్రెయిన్:కింగ్డమ్లోని భారతీయ వలసదారులంతా 'ఆధార్ ఆన్ ఎరైవల్' ప్రపోజల్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ఎన్నారైలుకు ఆధార్ ఆన్ ఎరైవల్ అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నారైలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ఆరు నెలలు వుంటేనే ఆధార్ దక్కుతుందనే నిబంధన ఇప్పటిదాకా అమల్లో వున్న విషయం విదితమే. కాగా, తాజా ప్రపోజల్పై హర్షం వ్యక్తం చేసిన భారతీయ వలసదారుడు రామ్శంకర్ మహేశ్వరన్, ఆధార్ లేకపోవడంతో ఎన్నారైలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్ పొందడం అలాగే చాలా విషయాలకు ఆధార్తో లంకె కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయనీ, కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమకు ఉపశమనం కలిగిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







