దుబాయ్ బస్ క్రాష్: కారణం అదేనా?
- July 09, 2019
ఇటీవల దుబాయ్లో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే వున్నారు. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ మవసలాత్కి చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమయ్యింది. అయితే, బస్సు పరిమిత వేగంతోనే వెళుతోందనీ, ప్రమాదానికి కారణం రోడ్డు బ్యారియర్ అనీ డ్రైవర్ తరఫు లాయర్ తమ వాదనల్ని న్యాయస్థానంలో విన్పించారు. బ్యారియర్ని అక్కడ తప్పుగా ఇన్స్టాల్ చేశారన్నది డిఫెన్స్ లాయర్ మొహమ్మద్ సైఫ్ అల్ తమిమి వాదన. రోడ్డుపై స్పీడ్ లిమిట్ గంటకు 60 కిలోమీటర్లు కాగా, వార్నింగ్ సైన్ బోర్డ్కీ రిస్ట్రిక్షన్ బ్యారియర్కీ మధ్య దూరం 60 మీటర్లు వుండాలని అల్ తమిమి చెప్పారు. అయితే ఆ డిస్టెన్స్ కేవలం 12 మీటర్లు మాత్రమే వుందని తమిమి వాదించారు. బ్యారియర్ మెటల్తో తయారుచేసినదై వుండకూడదనీ తమిమి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







