దుబాయ్ బస్ క్రాష్: కారణం అదేనా?
- July 09, 2019
ఇటీవల దుబాయ్లో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే వున్నారు. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ మవసలాత్కి చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమయ్యింది. అయితే, బస్సు పరిమిత వేగంతోనే వెళుతోందనీ, ప్రమాదానికి కారణం రోడ్డు బ్యారియర్ అనీ డ్రైవర్ తరఫు లాయర్ తమ వాదనల్ని న్యాయస్థానంలో విన్పించారు. బ్యారియర్ని అక్కడ తప్పుగా ఇన్స్టాల్ చేశారన్నది డిఫెన్స్ లాయర్ మొహమ్మద్ సైఫ్ అల్ తమిమి వాదన. రోడ్డుపై స్పీడ్ లిమిట్ గంటకు 60 కిలోమీటర్లు కాగా, వార్నింగ్ సైన్ బోర్డ్కీ రిస్ట్రిక్షన్ బ్యారియర్కీ మధ్య దూరం 60 మీటర్లు వుండాలని అల్ తమిమి చెప్పారు. అయితే ఆ డిస్టెన్స్ కేవలం 12 మీటర్లు మాత్రమే వుందని తమిమి వాదించారు. బ్యారియర్ మెటల్తో తయారుచేసినదై వుండకూడదనీ తమిమి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







