దుబాయ్‌ బస్‌ క్రాష్‌: కారణం అదేనా?

- July 09, 2019 , by Maagulf
దుబాయ్‌ బస్‌ క్రాష్‌: కారణం అదేనా?

ఇటీవల దుబాయ్‌లో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డ విషయం విదితమే. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే వున్నారు. ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మవసలాత్‌కి చెందిన బస్సు ఈ ప్రమాదానికి కారణమయ్యింది. అయితే, బస్సు పరిమిత వేగంతోనే వెళుతోందనీ, ప్రమాదానికి కారణం రోడ్డు బ్యారియర్‌ అనీ డ్రైవర్‌ తరఫు లాయర్‌ తమ వాదనల్ని న్యాయస్థానంలో విన్పించారు. బ్యారియర్‌ని అక్కడ తప్పుగా ఇన్‌స్టాల్‌ చేశారన్నది డిఫెన్స్‌ లాయర్‌ మొహమ్మద్‌ సైఫ్‌ అల్‌ తమిమి వాదన. రోడ్డుపై స్పీడ్‌ లిమిట్‌ గంటకు 60 కిలోమీటర్లు కాగా, వార్నింగ్‌ సైన్‌ బోర్డ్‌కీ రిస్ట్రిక్షన్‌ బ్యారియర్‌కీ మధ్య దూరం 60 మీటర్లు వుండాలని అల్‌ తమిమి చెప్పారు. అయితే ఆ డిస్టెన్స్‌ కేవలం 12 మీటర్లు మాత్రమే వుందని తమిమి వాదించారు. బ్యారియర్‌ మెటల్‌తో తయారుచేసినదై వుండకూడదనీ తమిమి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com