కర్ణాటక సంక్షోభం..ఎమ్మెల్యేలకు విప్ జారీ
- July 12, 2019బెంగళూరు: శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలకమైన ఆర్థిక బిల్లులు ఆమోదం పొందే దిశలో సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ మొత్తం 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. రాష్ట్ర చీఫ్ విప్ గణేష్ ప్రకాష్ హుక్కేరి ఈ మేరకు విప్ జారీ చేశారు. ఆర్థిక బిల్లులపై ఓటింగ్ జరిగే సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని విప్లో సూచించారు. విప్ను ఉల్లంఘిస్తే పార్టీ ఫిరాయింపుల నిషేధచట్టం ప్రకారం భారతీయ రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని విప్లో హెచ్చరించారు.
ఇప్పటికే శాసనసభత్వాలకు రాజీనామా సమర్పించిన 13 మంది ఎమ్మెల్యేలకు కూడా విప్ను జారీ చేశామని ఆయన మీడియాకు చెప్పారు. ఇదిలావుండగా జేడీఎస్ కూడా తన ఎమ్మెల్యేలందరికీ గురువారం రాత్రి విప్ను జారీ చేసింది. ఈ విప్ల ఆధారంగా శాసనసభలో శుక్రవారం వీరు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయకపోతే అనర్హత వేటు పడనుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాని, మంత్రులుగా నియమితులయ్యేందుకు గాని ఎంతమాత్రం అవకాశం ఉండదు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు