కర్ణాటక సంక్షోభం..ఎమ్మెల్యేలకు విప్ జారీ
- July 12, 2019
బెంగళూరు: శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలకమైన ఆర్థిక బిల్లులు ఆమోదం పొందే దిశలో సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ మొత్తం 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. రాష్ట్ర చీఫ్ విప్ గణేష్ ప్రకాష్ హుక్కేరి ఈ మేరకు విప్ జారీ చేశారు. ఆర్థిక బిల్లులపై ఓటింగ్ జరిగే సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని విప్లో సూచించారు. విప్ను ఉల్లంఘిస్తే పార్టీ ఫిరాయింపుల నిషేధచట్టం ప్రకారం భారతీయ రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని విప్లో హెచ్చరించారు.
ఇప్పటికే శాసనసభత్వాలకు రాజీనామా సమర్పించిన 13 మంది ఎమ్మెల్యేలకు కూడా విప్ను జారీ చేశామని ఆయన మీడియాకు చెప్పారు. ఇదిలావుండగా జేడీఎస్ కూడా తన ఎమ్మెల్యేలందరికీ గురువారం రాత్రి విప్ను జారీ చేసింది. ఈ విప్ల ఆధారంగా శాసనసభలో శుక్రవారం వీరు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయకపోతే అనర్హత వేటు పడనుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాని, మంత్రులుగా నియమితులయ్యేందుకు గాని ఎంతమాత్రం అవకాశం ఉండదు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







