పాస్పోర్టు 11 రోజుల్లోనే జారీ:మురళీధరన్
- July 12, 2019
న్యూ ఢిల్లీ :కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. పాస్ పోర్టు కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పంది.సాధారణ పరిస్థితుల్లో 11 రోజుల్లోనే పాస్పోర్టు జారీ చేస్తామని లోక్సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. పాస్పోర్టు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాంగ్రెస్కు చెందిన ఎంపీ మనీశ్ తివారీ ప్రస్తావించారు.
పాస్ పోర్టు పొందే విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... విచారణ పేరుతో ఆలస్యం జరుగుతోందని ఒక్కోసారి పాస్ పోర్టు రద్దయే పరిస్థితి కనిపిస్తోందని ఎంపీ తివారీ చెప్పారు. దీనిపై మంత్రి సమాధానమిచ్చారు.పాస్పోర్టు జారీ ప్రక్రియలో పోలీస్ వెరిఫికేషన్ కోసం 731 పోలీస్ జిల్లాల్లో యాప్ను ఉపయోగిస్తున్నామని మంత్రి చెప్పారు.
యాప్ ద్వారా అవినీతి రహితంగా విచారణ జరగమే కాకుండా, త్వరగా పాస్ పోర్టు పొందేందుకు అవకాశం కలుగుతోందన్నారు. దేశంలో 36 పాసుపోర్టు కేంద్రాలు ఉన్నాయని, 93 పాసుపోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని వివరించారు.412 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటిని నడిపేందుకు ఓ ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







