బ్రిటిష్ చమురు ట్యాంకర్ను అడ్డగించారు
- July 12, 2019
టెహ్రాన్ : వ్యూహాత్మకమైన గల్ఫ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ సాయుధ బోట్లు ఒక బ్రిటిష్ చమురు వాహక నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాయని, అయితే వారిని బ్రిటిష్ రాయల్ నేవీ ఫ్రిగేట్ సిబ్బంది తరిమికొట్టారని అమెరికన్ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. 2015 నాటి అణు ఒప్పందం నుండి ఏకపక్షంగా తప్పుకున్న అమెరికా తమపై విధిస్తున్న ఆంక్షల పట్ల ఇతర భాగస్వామ్య దేశాలు నిర్లిప్తతతో వ్యవహరిస్తుండటం ఇరాన్కు బాధ కలిగించింది. బ్రిటిష్ హెరిటేజ్ చమురు ట్యాంకర్ నౌక హోర్ముజ్ జలసంధిని దాటుతున్న సమయంలో ఇరాన్ దళాలు దానిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాయని ఇద్దరు అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ సిఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది. దానికి ఎలాంటి ఆధారాలను అది చూపలేదు. గత బుధవారం తమ చమురు నౌకను బ్రిటిష్ దళాలు జిబ్రాల్టర్ తీరంలో దిగ్బంధించటంపై మండిపడిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీ తమ నౌకను విడుదల చేయకుంటే 'తీవ్ర పరిణామాలు' ఎదుర్కొంటారని బ్రిటన్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. బ్రిటిష్ చమురు వాహక నౌకను తాము అడ్డుకున్నట్లు అమెరికన్ మీడియా ప్రసారం చేసిన వార్తలను ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) తీవ్రంగా ఖండించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







