TRS NRI సెల్ ఆధ్వర్యంలో మెంబర్షిప్ డ్రైవ్
- July 14, 2019
ఖతర్:తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు సందర్భంగా TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రారంభించిన సందర్భంగా, TRS NRI ముఖ్య సలహాదారు కల్వకుంట్ల కవిత, TRS NRI కో- ఆర్డనేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు దాదాపు నలభై దేశాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగలా సాగుతోంది. ఈ మేరకు TRS ఖతర్ శాఖ అధ్యక్షులు అబ్బగౌని శ్రీధర్ మరియు ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికేని ఆధ్వర్యంలో ఈ రోజు దోహా ఖతార్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ అబ్బాగౌని మాట్లాడుతూ TRS మరియు కేసిఆర్ జనాకర్షక పాలనకు వివిధ వర్గాల ప్రజలందరి నుండి విపరీతమైన స్పందన ఉందని, కేవలం తెలంగాణ వాసులే కాకుండా వివిధ రాష్ట్రల ప్రజలు TRS పార్టీ సభ్యత్వాన్ని తీసు కోడానికి స్వతహాగా ఫోన్ లు చేసి మరి సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే NRI లు తమ తమ నియోజకవర్గల్లో సైతం సభ్యత్వ నమోదు లో ముందున్నా రని ఇటీవలే జగిత్యాల జిల్లా మెట్పల్లి, జగ్గసాగర్ లో TRS Qatar ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్ కోరం ఆధ్వర్యంలో అతి పెద్ద సభ్యత్వ నమోదు శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రపంచ లో అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు ను కట్టిన తెలంగాణ లో ఉన్న TRS ప్రభుత్వం ప్రపంచ ద్రుష్టి ని ఆకర్షీస్తోందని,వివిధ దేశాల ప్రజల మధ్య చర్చనీయాంశం అయిందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి. కేసీఆర్ ని అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు NRI లు మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన ఈ ప్రాజెక్టు ను తము తమ తదుపరి భారత పర్యటనలో ప్రత్యక్షంగా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..