హైదరాబాద్:మెట్రో గుడ్ న్యూస్..

- July 18, 2019 , by Maagulf
హైదరాబాద్:మెట్రో గుడ్ న్యూస్..

మెట్రో వచ్చాక భాగ్య నగర వాసులకు ప్రయాణం సులువైంది. ఎక్కడికైనా హ్యాపీగా వెళిపోతున్నారు. మరి కొన్న రూట్లలో కూడా మెట్రో వస్తే బావుంటుంది అని అనుకునే వారికి మరో శుభవార్త చెప్పింది మెట్రో. ఆగస్టు మాసం చివరి నుంచి హైటెక్ సిటీ- రాయదుర్గ్ మధ్య మెట్రో రైల్ నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో చివరి టెస్ట్ రన్ నిర్వహిస్తున్నారు. ఐటీ వాసులు మెట్రో వరంగా మారింది. దీంతో ఈ మార్గంలో పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్‌కు 1.5 కిలోమీటర్లు కాగా, కారిడార్‌-3లో భాగంగా నాగోల్- రాయదుర్గ్ మధ్య రైళ్ల సర్వీసును పొడింగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com