జంపింగ్ రెడ్ లైట్స్: 4,000 మందికి పైగా మోటరిస్టులకు జరీమానా
- July 19, 2019
అబుదాబీ: వేలాది మంది వాహనదారులకు ఈ ఏడాది అప్పుడే జరీమానాల్ని విధించారు ట్రాఫిక్ అధికారులు. రెడ్ లైట్ సిగ్నల్ జంపింగ్కి సంబంధించి 4,367 మంది వాహనదారులకు జరీమానాలు విధించినట్లు అబుదాబీ పోలీసులు వెల్లడించారు. తొలి ఆరు నెలల్లో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, రెడ్ సిగ్నల్ లైట్ జంప్ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 52 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మోటరిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ లైట్ జంప్ చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారుల భద్రత కోసమే ట్రాఫిక్ రూల్స్ వున్నాయని, వాటిని పాటించాల్సి వుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







