దుబాయ్ నుంచి ప్రయాణించేవారికి దుబాయ్ మాల్ వద్ద బోర్డింగ్ పాస్లు
- July 24, 2019
దుబాయ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారికి దుబాయ్ మాల్ వద్ద బోర్డింగ్ పాస్లు లభ్యం కానున్నాయి. మాల్లో ఈ మేరకు కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు బ్యాగేజ్ చెకింగ్ కూడా ఇక్కడే చేసుకోవడానికి వుంది. బ్యాగేజీని ఇక్కడే చెక్ చేసి, ఎయిర్ క్రాఫ్ట్ వద్దకు తరలిస్తారు నిర్వాహకులు. డుబ్జ్ అనే బ్యాగేజీ టెక్నాలజీ మరియు లాజిస్టిక్స్ కంపెనీ ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఫ్లై దుబాయ్, సౌదియా, ఫైలనాస్, చైనా సదరన్, కువైట్ ఎయిర్ వేస్, గల్ఫ్ ఎయిర్, సౌదీ గల్ఫ్, రాయల్ జోర్డానియన్ మరియు ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు తమ సేవల్ని దుబ్జ్ అందిస్తోంది. ఫ్లై దుబాయ్ ఇండియాలోని ముంబై మరియు ఢిల్లీతోపాటు పాకిస్తాన్, ముల్తాన్ తదితర దేశాలకు విమానాల్ని నడుపుతోంది. కాగా, బ్యాగేజీ - బోర్డింగ్ పాస్ సర్వీసులు 99 దిర్హామ్ల నుంచి అందుబాటులో వుంటాయి. ఒక ప్యాసింజర్కి చెక్ ఇన్ పీజుతోపాటు ఓ పీస్ లగేజ్ ఇందులో లభిస్తుంది. అదనపు లగేజ్కి 40 దిర్హామ్లు వసూలు చేస్తారు. 10 బ్యాగ్ల వరకు 249 దిర్హామ్లకు సేవల్ని అందించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







