దుబాయ్ నుంచి ప్రయాణించేవారికి దుబాయ్ మాల్ వద్ద బోర్డింగ్ పాస్లు
- July 24, 2019
దుబాయ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారికి దుబాయ్ మాల్ వద్ద బోర్డింగ్ పాస్లు లభ్యం కానున్నాయి. మాల్లో ఈ మేరకు కొత్త ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు బ్యాగేజ్ చెకింగ్ కూడా ఇక్కడే చేసుకోవడానికి వుంది. బ్యాగేజీని ఇక్కడే చెక్ చేసి, ఎయిర్ క్రాఫ్ట్ వద్దకు తరలిస్తారు నిర్వాహకులు. డుబ్జ్ అనే బ్యాగేజీ టెక్నాలజీ మరియు లాజిస్టిక్స్ కంపెనీ ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఫ్లై దుబాయ్, సౌదియా, ఫైలనాస్, చైనా సదరన్, కువైట్ ఎయిర్ వేస్, గల్ఫ్ ఎయిర్, సౌదీ గల్ఫ్, రాయల్ జోర్డానియన్ మరియు ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు తమ సేవల్ని దుబ్జ్ అందిస్తోంది. ఫ్లై దుబాయ్ ఇండియాలోని ముంబై మరియు ఢిల్లీతోపాటు పాకిస్తాన్, ముల్తాన్ తదితర దేశాలకు విమానాల్ని నడుపుతోంది. కాగా, బ్యాగేజీ - బోర్డింగ్ పాస్ సర్వీసులు 99 దిర్హామ్ల నుంచి అందుబాటులో వుంటాయి. ఒక ప్యాసింజర్కి చెక్ ఇన్ పీజుతోపాటు ఓ పీస్ లగేజ్ ఇందులో లభిస్తుంది. అదనపు లగేజ్కి 40 దిర్హామ్లు వసూలు చేస్తారు. 10 బ్యాగ్ల వరకు 249 దిర్హామ్లకు సేవల్ని అందించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









