నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- July 24, 2019
మస్కట్: ఓ చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. దోఫార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. వాడి దర్బాత్లో చిన్నారి నీట మునిగిన అంశం తమ దృష్టికి రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. రెస్క్యూ టీమ్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, చిన్నారిని కాపాడలేకపోయామనీ, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందని అధికారులు వివరించారు. బీచ్ని సందర్శించేవారు లేదా పాండ్స్ అలాగే వాడిల వద్దకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







