నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- July 24, 2019
మస్కట్: ఓ చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. దోఫార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. వాడి దర్బాత్లో చిన్నారి నీట మునిగిన అంశం తమ దృష్టికి రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. రెస్క్యూ టీమ్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, చిన్నారిని కాపాడలేకపోయామనీ, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందని అధికారులు వివరించారు. బీచ్ని సందర్శించేవారు లేదా పాండ్స్ అలాగే వాడిల వద్దకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







