నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- July 24, 2019
మస్కట్: ఓ చిన్నారి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. దోఫార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. వాడి దర్బాత్లో చిన్నారి నీట మునిగిన అంశం తమ దృష్టికి రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. రెస్క్యూ టీమ్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, చిన్నారిని కాపాడలేకపోయామనీ, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందని అధికారులు వివరించారు. బీచ్ని సందర్శించేవారు లేదా పాండ్స్ అలాగే వాడిల వద్దకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









