రక్తపు మడుగులో భారత వలసదారుడు

- July 25, 2019 , by Maagulf
రక్తపు మడుగులో భారత వలసదారుడు

కువైట్‌ సిటీ: భారతీయ వలసదారుడొకరు తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్పాన్సరర్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పారామెడిక్స్‌ ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వఫ్రాలోని ఫామ్‌ బయట ఆ వ్యక్తిని గుర్తించారు. అదాన్‌ హాస్పిటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ప్రస్తుతం బాధితుడు వైద్య చికిత్స పొందుతున్నాడు. రెండు చేతుల మీదా బాధితుడికి గాయాలు వున్నాయనీ, మెడపైనా బలమైన గాయం వుందనీ వైద్యులు పేర్కొన్నారు. పారామెడిక్స్‌ అతన్ని వద్దకు చేరుకునే సరికే అసస్మారక స్థితిలో వున్నాడని అధికారులు తెలిపారు. అతను కోలుకుంటే తప్ప, ఏం జరిగిందనేది చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com