రక్తపు మడుగులో భారత వలసదారుడు
- July 25, 2019
కువైట్ సిటీ: భారతీయ వలసదారుడొకరు తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్పాన్సరర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పారామెడిక్స్ ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వఫ్రాలోని ఫామ్ బయట ఆ వ్యక్తిని గుర్తించారు. అదాన్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతం బాధితుడు వైద్య చికిత్స పొందుతున్నాడు. రెండు చేతుల మీదా బాధితుడికి గాయాలు వున్నాయనీ, మెడపైనా బలమైన గాయం వుందనీ వైద్యులు పేర్కొన్నారు. పారామెడిక్స్ అతన్ని వద్దకు చేరుకునే సరికే అసస్మారక స్థితిలో వున్నాడని అధికారులు తెలిపారు. అతను కోలుకుంటే తప్ప, ఏం జరిగిందనేది చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం







