రక్తపు మడుగులో భారత వలసదారుడు
- July 25, 2019
కువైట్ సిటీ: భారతీయ వలసదారుడొకరు తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్పాన్సరర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పారామెడిక్స్ ప్రాథమిక చికిత్స చేసి, ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వఫ్రాలోని ఫామ్ బయట ఆ వ్యక్తిని గుర్తించారు. అదాన్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతం బాధితుడు వైద్య చికిత్స పొందుతున్నాడు. రెండు చేతుల మీదా బాధితుడికి గాయాలు వున్నాయనీ, మెడపైనా బలమైన గాయం వుందనీ వైద్యులు పేర్కొన్నారు. పారామెడిక్స్ అతన్ని వద్దకు చేరుకునే సరికే అసస్మారక స్థితిలో వున్నాడని అధికారులు తెలిపారు. అతను కోలుకుంటే తప్ప, ఏం జరిగిందనేది చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









