వేతనాలు అందక 4,000 మంది వలసదారుల ఆవేదన
- July 25, 2019
కువైట్: నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆవేదన చెందుతున్నామంటూ 4,000 మందికి పైగా వలసదారులు ఆందోళన బాట పట్టారు. వారితో సంప్రదింపులు చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ లేబర్ వర్గాలు వెల్లడించాయి. షేక్ జబెర్ అల్ అహ్మద్ స్టేడియం వద్ద ఈ ఆందోళన జరిగింది. ఆందోళన చేపట్టినవారిలో ఎక్కువమంది ఆసియాకి చెందిన వలసదారులే వున్నారు. బాధిత వలసదారుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, తాము పనిచేస్తున్న కంపెనీ తమ రెసిడెన్సీ పర్మిట్స్ని రెన్యూవల్ చేయని కారణంగా తాము అక్రమంగా దేశంలో నివాసం వుంటున్నట్లుగా మారిందని ఆందోళన చేస్తున్న వలసదారుల్లో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ ఆయిల్ కంపెనీతో కాంట్రాక్ట్ వున్న ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ వీరిని బాధితులుగా మార్చింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!