వేతనాలు అందక 4,000 మంది వలసదారుల ఆవేదన
- July 25, 2019
కువైట్: నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆవేదన చెందుతున్నామంటూ 4,000 మందికి పైగా వలసదారులు ఆందోళన బాట పట్టారు. వారితో సంప్రదింపులు చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ లేబర్ వర్గాలు వెల్లడించాయి. షేక్ జబెర్ అల్ అహ్మద్ స్టేడియం వద్ద ఈ ఆందోళన జరిగింది. ఆందోళన చేపట్టినవారిలో ఎక్కువమంది ఆసియాకి చెందిన వలసదారులే వున్నారు. బాధిత వలసదారుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, తాము పనిచేస్తున్న కంపెనీ తమ రెసిడెన్సీ పర్మిట్స్ని రెన్యూవల్ చేయని కారణంగా తాము అక్రమంగా దేశంలో నివాసం వుంటున్నట్లుగా మారిందని ఆందోళన చేస్తున్న వలసదారుల్లో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ ఆయిల్ కంపెనీతో కాంట్రాక్ట్ వున్న ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ వీరిని బాధితులుగా మార్చింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







