వేతనాలు అందక 4,000 మంది వలసదారుల ఆవేదన
- July 25, 2019
కువైట్: నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆవేదన చెందుతున్నామంటూ 4,000 మందికి పైగా వలసదారులు ఆందోళన బాట పట్టారు. వారితో సంప్రదింపులు చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ లేబర్ వర్గాలు వెల్లడించాయి. షేక్ జబెర్ అల్ అహ్మద్ స్టేడియం వద్ద ఈ ఆందోళన జరిగింది. ఆందోళన చేపట్టినవారిలో ఎక్కువమంది ఆసియాకి చెందిన వలసదారులే వున్నారు. బాధిత వలసదారుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, తాము పనిచేస్తున్న కంపెనీ తమ రెసిడెన్సీ పర్మిట్స్ని రెన్యూవల్ చేయని కారణంగా తాము అక్రమంగా దేశంలో నివాసం వుంటున్నట్లుగా మారిందని ఆందోళన చేస్తున్న వలసదారుల్లో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ ఆయిల్ కంపెనీతో కాంట్రాక్ట్ వున్న ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ వీరిని బాధితులుగా మార్చింది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









