బందరు పోర్టు తెలంగాణకు అమ్మడం లేదు--మేకపాటి గౌతమ్ రెడ్డి
- July 26, 2019
అమరావతి:బందరు పోర్టును ఐదేళ్లలో పూర్తి చేస్తామని, తెలంగాణ రాష్ట్రానికి అమ్ముకుంటామనేది వాస్తవం కాదన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని..ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు జరగాలంటే..కేంద్రం అనుమతి ఉండాలని తెలిపారు. సీఎం జగన్తో చర్చించి పోర్టుపై ఒక నిర్ణయానికి వస్తామని సభకు తెలిపారు.
2019, జులై 26వ తేదీ శుక్రవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. బందరు పోర్టుపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. దీనికి మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రైవేటు డెవలపర్ చేయకపోతే..ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తామని మంత్రి మేకపాటి తెలిపారు.
అంతకు ముందు పలువురు సభ్యులు దీనిపై మాట్లాడారు. ఈ పోర్టును ప్రభుత్వమే నిర్మించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బాబు హయాంలో అవసరానికి మించి భూ సేకరణ చేశారని, మొత్తం 4వేల ఎకరాల భూ సేకరణ చేసినట్లు చెప్పారు. రూ. 10 కోట్లతో శంకుస్థాపనతో చేశారని సభలో వెల్లడించారు. బందరు పోర్టుకు దశబ్దాల చరిత్ర ఉందని..ఈ పోర్టుపై టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు ఎమ్మెల్యే జోగి రమేష్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ సేకరణ చేయాలని అనుకున్నారని..బలవంతంగా భూ సేకరణ చేయాలని బాబు చూశారని తెలిపారు. భూ సేకరణ నోటిఫికేషన్ను ఎప్పుడు రద్దు చేస్తారని సభలో ప్రశ్నించారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









