పోస్టాఫీస్లో డ్రైవర్ ఉద్యోగాలు..
- July 26, 2019
ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల నియామకాన్ని చేపట్టింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ , పెద్దపల్లి, మహబూబ్నగర్ డివిజన్లలో స్టాఫ్ కార్ డ్రైవర్లను నియమించనుంది. ఇందుకోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. వాటిలో ఓబీసీలకు 2, ఎస్టీలకు 1 పోస్టును రిజర్వ్ చేశారు. ఎంపికైన వారికి వేతనం రూ.19,900 ఇస్తారు. రెండేళ్లు ప్రొబేషన్ పీరియడ్ వుంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్ 14 చివరి తేదీ. 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఓబీసీ, ఎస్టీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
లైట్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. దాంతో పాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్ తర్వాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. పరీక్ష తేదీ, స్థలం లాంటి వివరాలను ఇండియా పోస్ట్ త్వరలో వెల్లడిస్తుంది. ఏజ్ ఫ్రూఫ్, విద్యార్హతల సర్టిఫికెట్, డ్రైవింగ్ ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్, ఓబీసీ, ఎస్టీలకు క్యాస్ట్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్తో పాటు ఓ పాస్పోర్ట్ ఫోటో దరఖాస్తుకు జత చేయాలి. ఆగస్ట్ 14 సాయింత్రం 5.30 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తుల్ని అనుమతించరు. దరఖాస్తుల్నిపంపాల్సిన అడ్రస్.. The Manager Mail Motor Service Koti, Hyderabad-500095.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









