మిసైల్ పరీక్షలకు దిగిన నార్త్ కొరియా
- July 26, 2019
ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. రెండు స్వల్పశ్రేణి మిసైళ్లను నార్త్ కొరియా పరీక్షించింది. వోన్సన్ పట్టణంలో ఈ పరీక్ష జరిగింది. సుమారు 430 కిలోమీటర్లు ప్రయాణించిన మిస్సైళ్లు.. తూర్పు సముద్రంలో పడినట్లు సమాచారం. ఐతే, ఆ క్షిపణులు జపాన్ జలాల్లోకి రాలేదని జపాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వచ్చేనెలలో దక్షిణ కొరియా-అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. సైనిక ప్రదర్శనను ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా-దక్షిణ తీరుపై మండిపడుతున్న నార్త్ కొరియా, మిసైల్ పరీక్షలకు దిగింది. ఆ జంట మిస్సైళ్లు K.N-23S అయి ఉంటాయని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. K.N-23S క్షిపణులు అణ్వాయుధాలను మోసుకు వెళ్లగలవని సమాచారం.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







