మిసైల్ పరీక్షలకు దిగిన నార్త్ కొరియా
- July 26, 2019
ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. రెండు స్వల్పశ్రేణి మిసైళ్లను నార్త్ కొరియా పరీక్షించింది. వోన్సన్ పట్టణంలో ఈ పరీక్ష జరిగింది. సుమారు 430 కిలోమీటర్లు ప్రయాణించిన మిస్సైళ్లు.. తూర్పు సముద్రంలో పడినట్లు సమాచారం. ఐతే, ఆ క్షిపణులు జపాన్ జలాల్లోకి రాలేదని జపాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వచ్చేనెలలో దక్షిణ కొరియా-అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. సైనిక ప్రదర్శనను ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా-దక్షిణ తీరుపై మండిపడుతున్న నార్త్ కొరియా, మిసైల్ పరీక్షలకు దిగింది. ఆ జంట మిస్సైళ్లు K.N-23S అయి ఉంటాయని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. K.N-23S క్షిపణులు అణ్వాయుధాలను మోసుకు వెళ్లగలవని సమాచారం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







