జైపాల్రెడ్డికి ఉప రాష్ట్రపతి నివాళి
- July 28, 2019
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి(77) పార్థివదేహానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీలో ఇద్దరమూ ఒకే బెంచీలో రెండు పర్యాయాలు కూర్చున్నామన్నారు. ప్రతిపక్షంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించామని తెలిపారు. ఆయన మేథాశక్తి, విమర్శనా శైలి, విషయ పరిజ్ఞానం, భాషా ప్రావీణ్యం అద్భుతమని కొనియాడారు.
మరోవైపు జైపాల్రెడ్డి మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా జైపాల్రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ మేరకు రామ్నాథ్ కోవింద్, మోడీ ట్విటర్లో పోస్టు చేశారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు