భారతీయులకు గుడ్న్యూస్ చెప్పిన ఇరాన్
- July 28, 2019
ఇరాన్:ఇరాన్ వెళ్లే భారతీయులకు మల్టీ ఎంట్రీ వీసాలను ఇవ్వనున్నట్టు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇరాన్-భారత్ మధ్య సత్సంబంధాలు ఊపందుకున్నాయి. ఇరాన్ నుంచి చమురు దిగుమతిని నిలిపివేయాలని.. అమెరికా ఆంక్షల కారణంగా చబహర్ నౌకాశ్రయం విస్తరణకు కూడా బడ్జెట్ తగ్గించాలని భారత్ నిశ్చయించుకున్నప్పటికీ ఇరాన్ ఇలా ప్రకటించడం విశేషం. ఇరాన్ ప్రకటించిన ఈ మల్టీ ఎంట్రీ వీసా కాల పరిమితి సంవత్సరం పాటు ఉండనుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని వీసా ఆన్ అరైవల్ కాల పరిమితిని కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించింది. చట్టపరమైన విషయాలలో పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపై కూడా ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. పౌర, వాణిజ్య విషయాలపై పరస్పర న్యాయ సహాయంపై ఒప్పందం గురించి ప్రస్తుతం ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ గురువారం పార్లమెంట్లో తెలిపారు. మే 14న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-ఇరాన్ జాయింట్ కాన్సులర్ కమిటీ సమావేశం(జేసీసీఎమ్) సందర్భంగా ఈ ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!