భారతీయులకు గుడ్న్యూస్ చెప్పిన ఇరాన్
- July 28, 2019
ఇరాన్:ఇరాన్ వెళ్లే భారతీయులకు మల్టీ ఎంట్రీ వీసాలను ఇవ్వనున్నట్టు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇరాన్-భారత్ మధ్య సత్సంబంధాలు ఊపందుకున్నాయి. ఇరాన్ నుంచి చమురు దిగుమతిని నిలిపివేయాలని.. అమెరికా ఆంక్షల కారణంగా చబహర్ నౌకాశ్రయం విస్తరణకు కూడా బడ్జెట్ తగ్గించాలని భారత్ నిశ్చయించుకున్నప్పటికీ ఇరాన్ ఇలా ప్రకటించడం విశేషం. ఇరాన్ ప్రకటించిన ఈ మల్టీ ఎంట్రీ వీసా కాల పరిమితి సంవత్సరం పాటు ఉండనుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని వీసా ఆన్ అరైవల్ కాల పరిమితిని కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించింది. చట్టపరమైన విషయాలలో పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపై కూడా ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. పౌర, వాణిజ్య విషయాలపై పరస్పర న్యాయ సహాయంపై ఒప్పందం గురించి ప్రస్తుతం ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ గురువారం పార్లమెంట్లో తెలిపారు. మే 14న న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-ఇరాన్ జాయింట్ కాన్సులర్ కమిటీ సమావేశం(జేసీసీఎమ్) సందర్భంగా ఈ ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







