పాదచారుల ట్రాఫిక్‌ ఫైన్స్‌ అమల్లోకి

- August 01, 2019 , by Maagulf
పాదచారుల ట్రాఫిక్‌ ఫైన్స్‌ అమల్లోకి

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, పాదచారుల ట్రాఫిక్‌ ఫైన్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై ప్రమాదాల్ని నివారించే క్రమంలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పాదచారులకూ జరీమానాలు విధించనున్నారు. పేవ్‌మెంట్లు కాకుండా రోడ్డుపై నడిచినా, ఎంపిక చేసిన చోట్ల కాకుండా ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటినా, రోడ్‌ ఇంటర్‌సెక్షన్‌ దగ్గర సిగ్నల్‌ని పట్టించుకోకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించినా జరీమానాలు తప్పవు. 100 ఖతారీ రియాల్స్‌ నుంచి 500 ఖతారీ రియాల్స్‌ వరకూ ఆయా ఉల్లంఘనలకు జరీమానాలు విధించబోతున్నారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా పాదచారులకూ జరీమానాలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com