బస్, కారు ఢీ: 21 మంది కార్మికులకు గాయాలు
- August 14, 2019
దుబాయ్:21 మంది బ్లూ కాలర్డ్ వర్కర్స్ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముహౌసినాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాద బాధితుల్ని అల్ నహ్దాలోని ఎన్ఎంసి హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారికి 18 మంది మెడికల్ స్టాఫ్ వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గాయపడ్డవారిలో ఒక ఇండియన్ కూడా వున్నారు. 8 మంది బంగ్లాదేశీలు, ఆరుగురు నేపాలీయులు, నలుగురు పాకిస్తానీయులు, ఒక కెన్యన్, ఒక గాంబియన్ కూడా వున్నట్లు అధికారులు తెలిపారు. 19 మంది పేషెంట్లకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయనీ, ఇద్దరికి ఓ మోస్తరు గాయాలయ్యాయనీ, ఒకరికి సీరియస్గా వుందని వైద్యులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









