ఇండోనేషియా రాజధాని మారింది..కారణమేంటో చదవండి..
- August 18, 2019
ఇండోనేషియా దేశంలో తరచుగా భూకంపాలు, సునామి, వరదలు వస్తుంటాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ ముప్పు ఇండోనేషియాలోని మిగతా ప్రాంతాలకంటే ఆ దేశ రాజధానిపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నది. దీంతో ఆ దేశ రాజధానిని మార్చాలని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రకటించాడు.
ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ఈ విషయం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్ కు ఇండోనేషియా రాజధానిని తరలించనున్నట్టు అయన తెలిపారు. ప్రస్తుత రాజధాని జకార్తాలో ప్రతి సంవత్సరం 25 సెంటీమీటర్ల చొప్పున సముద్రంలో మునిగిపోతున్నదని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక భాగం సముద్రంలో మునిగిపోతుందని నిపుణులు హెచ్చరించినట్టు ఆయన తెలిపాడు. అందుకే రాజధానిని జకార్తా నుంచి కాళీమంథన్ కు మార్చబోతున్నట్టు అయన తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







