ఐఎస్ఐ అలజడులు.. ఐబి హెచ్చరికలు..ఈ మూడు రాష్ట్రాలను జల్లెడపడుతున్న పోలీసులు
- August 20, 2019
ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత పెంచిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చి రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐబి సమాచారం అందించింది. ఐబి అందించిన సమాచారంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ను ప్రకటించారు. ఈ మూడు రాష్ట్రాలను పోలీసులు జల్లెడపడుతున్నాయి.
దేశంలోకి నాలుగు ఐఎస్ఐ తీవ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందటంతో.. హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని పోలీసులకు కేంద్రం ఆదేశించింది. కీలకమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానితులను ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







