ఓనమ్‌ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ప్రత్యేక విమానాలు

- August 21, 2019 , by Maagulf
ఓనమ్‌ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ప్రత్యేక విమానాలు

కేరళలో ప్రముఖ ఫెస్టివల్స్‌లో ఒకటైన ఓనమ్‌ సందర్భంగా యూఏఈ నుంచి కేరళకు ఎయిర్‌ ఇండియా శ్రీక్స్‌ప్రెస్‌ ప్రత్యేక విమానాల్ని నడపబోతోంది. ప్రస్తుతం నడుస్తున్న రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా ఈ కొత్త విమానాలు ప్రయాణీకులకు సేవలందిస్తాయి. అబుదాబీ నుంచి తిరువనంతపురం, కోచి విమానాశ్రయాలకు విమానల్ని నడపనున్నారు. సెప్టెంబర్‌ 6 ఉదయం 5 గంటలకు ఈ విమానాలు స్టార్ట్‌ అవుతాయని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రతినిథులు తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఓనమ్‌ ఫెస్టివల్‌ సెప్టెంబర్‌ 13తో ముగుస్తుంది. ఓనమ్‌ సీజన్‌ సందర్భంగా పలు గల్ఫ్‌ దేశాలు కేరళకు ప్రత్యేకంగా విమానాలు నడపనున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com