యూఏఈలో 'రూపే' కార్డ్‌ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

- August 22, 2019 , by Maagulf
యూఏఈలో 'రూపే' కార్డ్‌ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

యూఏఈ:మిడిల్‌ ఈస్ట్‌లో తొలిసారిగా యూఏఈలో రూపే కార్డ్‌ అందుబాటులోకి రానుంది. మాస్టర్‌ కార్డ్‌, వీసా కార్డ్‌ తరహాలోనే ఇండియాకి చెందిన రూపే కార్డ్‌ పనిచేయనుంది. ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ రూపే కార్డ్‌ని ప్రారంభిస్తారని ఇండియాకి చెందిన టాప్‌ డిప్లమాట్‌ ఒకరు వెల్లడించారు. యూఏఈలోని ఇండియన్‌ అంబాసిడర్‌ నవ్‌దీప్‌ సింగ్‌ సూరి మాట్లాడుతూ, ఇండియా మరయు యూఏఈ మధ్య ఈ మేరకు మెమోరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాడింగ్‌ జరిగిందనీ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అలాగే యూఏఈకి చెందిన మెర్క్యురీ పేమెంట్స్‌ సర్వీసెస్‌ మధ్య ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రీజియన్‌లో యూఏఈ అతి పెద్ద వైబ్రెంట్‌ బిజినెస్‌ హబ్‌ అనీ, యూఏఈలో ఇండియన్‌ కమ్యూనిటీ పెద్దయెత్తున వుందనీ, ఈ నేపథ్యంలో రూపే కార్డ్‌ ఇక్కడ విజయవంతమవుతుందని ఆయన వెల్లడించారు. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com