యూఏఈలో 'రూపే' కార్డ్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 22, 2019
యూఏఈ:మిడిల్ ఈస్ట్లో తొలిసారిగా యూఏఈలో రూపే కార్డ్ అందుబాటులోకి రానుంది. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ తరహాలోనే ఇండియాకి చెందిన రూపే కార్డ్ పనిచేయనుంది. ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ రూపే కార్డ్ని ప్రారంభిస్తారని ఇండియాకి చెందిన టాప్ డిప్లమాట్ ఒకరు వెల్లడించారు. యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్దీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఇండియా మరయు యూఏఈ మధ్య ఈ మేరకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాడింగ్ జరిగిందనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే యూఏఈకి చెందిన మెర్క్యురీ పేమెంట్స్ సర్వీసెస్ మధ్య ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రీజియన్లో యూఏఈ అతి పెద్ద వైబ్రెంట్ బిజినెస్ హబ్ అనీ, యూఏఈలో ఇండియన్ కమ్యూనిటీ పెద్దయెత్తున వుందనీ, ఈ నేపథ్యంలో రూపే కార్డ్ ఇక్కడ విజయవంతమవుతుందని ఆయన వెల్లడించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







