SVR విగ్రహావిష్కరణ వాయిదా
- August 24, 2019
విశ్వ నట చక్రవర్తి SV రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్.రోడ్డులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ముహూర్తం నిర్ణయించారు. దీనికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిందిగా ఎస్వీఆర్ సమితి సభ్యులు చిరును కలిసి కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని వాయిదా వేసినట్లు సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని తెలుస్తోంది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామంటున్నారు.
తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సేవా సమితి కొన్ని నెలల కిందట ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. చిరంజీవితో విగ్రహాన్ని ఆవిష్కరింప చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ కార్యక్రమం కూడా వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







