227 మంది చిన్నారులు..
- August 28, 2019
చిలీ:అది చిలీ దేశం.. పెరూలోని ఓ చారిత్రక ప్రదేశంలో పురావస్తు శాఖ తవ్వినకొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. ఈ అవశేషాలన్నీ 4 నుంచి 14 ఏళ్ల లోపు వారివే. లిమాకు దగ్గర్లో ఉన్న తీర ప్రాంత పట్టణం హువాన్చాకోలో 227 మానవ శరీర అవశేషాల్ని కనుగొన్నారు.ఆర్కియాలజిస్టులు.1475లో అంతరించిన ఈ జాతి చిమూ సంస్కృతికి చెందినదిగా పరిశోధకులు తెలిపారు వారు ఆరాధించే దేవుడు కోసం తమకు తాముగా ప్రాణ త్యాగం చేసుకుని వుంటారని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. వారంతా చిన్న పిల్లలు కావడం బాధాకరమన్నారు. ఈ అవశేషాలకు సంబంధించిన పలు విషయాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ సమయంలో నరబలి ఉండేదని వివరించారు. ఎల్ నినో (పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఓ ప్రత్యేక వాతావరణం) సమయంలో ఈ బలులు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
మెుదటిసారిగా రాజధానికి దగ్గరలో ఉన్న పంపాలా క్రజ్ వద్ద జరిపిన తవ్వకాల్లో 56 పుర్రెలు వెలికితీశారు. తర్వాత హువాన్చాకోలో మరో 190 మంది చిన్నారుల శరీర అవశేషాలను కనుగొన్నారు. మానవ అస్థిపంజరాలతో పాటు 200 ఒంటెల అస్థిపంజరాలు బయటపడ్డాయని అన్నారు. తవ్విన ప్రతి చోటా చిన్నారుల పుర్రెలు, చర్మంతో కూడిన ఎముకల గూళ్లు, తల వెంట్రుకలు బయటపడడం బాధాకరమన్నారు. చిన్నారుల సామూహిక బలి ఆనాటి అనాగరికతకు అద్దం పడుతుందని శాస్త్రవేత్తలు భావోద్వేగంతో వివరించారు. ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బయటపడ్డ అవశేషాలు సముద్రం వైపునకు ఉన్నాయని, వారు ఆ వైపు ప్రాణాలు త్యాగం చేసి ఉంటారని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







