విశాఖపట్నంలో వెలుగుచూసిన మరో ఆన్లైన్ దోపిడీ
- September 02, 2019
విశాఖలో ఆన్లైన్ చీటింగ్కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7.6 లక్షల నగదుతోపాటు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం లింక్ బిజినెస్ చేసేందుకు విశాఖలో 2 రోజుల కిందట ఓ ముఠా మకాం వేసింది. అనుమానం వచ్చిన విశాఖ పోలీసులు దర్యాప్తు చేసి సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
మెండోలిల్ జ్యువెలరీ లిమిటెడ్ కంపెనీ పేరుతో చైన్ లింక్ బిజినెస్ చేసే గుర్గావ్ ముఠా ఓ హోటల్లో మకాం వేసింది. ఆన్లైన్ ద్వారా తమ కంపెనీలో సభ్యులుగా చేరేవారికి నగదుతోపాటు బంగారం ఇస్తామని ఆశచూపారు. ముందుగా 11 వేల నగదుతోపాటు జీఎస్టీ కింద 3 వందలు కట్టాలన్నది స్కీమ్. ఆ తర్వాత కంపెనీ నుంచి ప్రతినెలా 550 రూపాయలు, ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇచ్చారు. దీంతో చాలా మంది ఆసక్తిచూపారు. హోటల్కు పెద్ద ఎత్తున జనాలు రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రెయిడ్ చేసి అందరినీ అదుపులో తీసుకున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!