స్కూల్ ఫస్ట్ డే: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీచర్
- September 03, 2019
యూఏఈ: కొత్త అకడమిక్ ఇయర్ తొలి రోజు రోడ్డు ప్రమాదంలో టీచర్ గాయపడిన ఘటన అల్ అయిన్లో చోటు చేసుకుంది. అల్ సరూజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో టీచర్కి తీవ్రంగా గాయాలయ్యాయి. పార్కింగ్ లాట్లోని తన కారు వద్దకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జీబ్రా క్రాసింగ్ వద్దనే ఆమె రోడ్డు దాటగా, ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి ఆమెను ఢీకొంది. పోలీసులు, ఈ ఘటనలో కారు డ్రైవర్దే తప్పుగా తేల్చారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే, అంబులెన్స్ సకాలంలో అక్కడికి చేరుకుంది. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. కాగా, రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై జరీమానా విధిస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







