స్కూల్ ఫస్ట్ డే: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీచర్
- September 03, 2019
యూఏఈ: కొత్త అకడమిక్ ఇయర్ తొలి రోజు రోడ్డు ప్రమాదంలో టీచర్ గాయపడిన ఘటన అల్ అయిన్లో చోటు చేసుకుంది. అల్ సరూజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో టీచర్కి తీవ్రంగా గాయాలయ్యాయి. పార్కింగ్ లాట్లోని తన కారు వద్దకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జీబ్రా క్రాసింగ్ వద్దనే ఆమె రోడ్డు దాటగా, ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి ఆమెను ఢీకొంది. పోలీసులు, ఈ ఘటనలో కారు డ్రైవర్దే తప్పుగా తేల్చారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే, అంబులెన్స్ సకాలంలో అక్కడికి చేరుకుంది. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. కాగా, రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై జరీమానా విధిస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!