స్కూల్ ఫస్ట్ డే: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీచర్
- September 03, 2019
యూఏఈ: కొత్త అకడమిక్ ఇయర్ తొలి రోజు రోడ్డు ప్రమాదంలో టీచర్ గాయపడిన ఘటన అల్ అయిన్లో చోటు చేసుకుంది. అల్ సరూజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో టీచర్కి తీవ్రంగా గాయాలయ్యాయి. పార్కింగ్ లాట్లోని తన కారు వద్దకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జీబ్రా క్రాసింగ్ వద్దనే ఆమె రోడ్డు దాటగా, ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి ఆమెను ఢీకొంది. పోలీసులు, ఈ ఘటనలో కారు డ్రైవర్దే తప్పుగా తేల్చారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే, అంబులెన్స్ సకాలంలో అక్కడికి చేరుకుంది. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. కాగా, రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై జరీమానా విధిస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







