బంగారం ధర భగ భగ
- September 04, 2019
బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయ్. హైదరాబాద్లో 99.9 శాతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల పదిగ్రాముల ధర బుధవారం ఒకేరోజు 537 రూపాయలు పెరిగి 39వేల 590కి చేరింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాముల ధర.. 37 వేల 790కి చేరింది. గతవారం ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరుకున్న పుత్తడి ధర చివర్లో తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. బంగారంతో పాటు వెండి మరింత బలపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి 1,080 రూపాయలు పెరిగి రూ.47,960కి చేరుకుంది.
రూపాయి విలువ భారీగా పతనం కావడం కూడా.. బంగారం ధర పెరుగుదలకు కారణమంటున్నారు మార్కెట్ నిపుణులు. ముఖ్యంగా యూఎస్-చైనా ట్రేడ్ వార్ ఫలితంగా ఇప్పటికే బంగారం ధరలు 20 శాతం పెరిగిపోయాయి. భవిష్యత్తులో పసిడి ధరలు అర లక్షకు చేరువైనా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







