బంగారం ధర భగ భగ
- September 04, 2019
బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయ్. హైదరాబాద్లో 99.9 శాతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల పదిగ్రాముల ధర బుధవారం ఒకేరోజు 537 రూపాయలు పెరిగి 39వేల 590కి చేరింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాముల ధర.. 37 వేల 790కి చేరింది. గతవారం ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరుకున్న పుత్తడి ధర చివర్లో తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. బంగారంతో పాటు వెండి మరింత బలపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి 1,080 రూపాయలు పెరిగి రూ.47,960కి చేరుకుంది.
రూపాయి విలువ భారీగా పతనం కావడం కూడా.. బంగారం ధర పెరుగుదలకు కారణమంటున్నారు మార్కెట్ నిపుణులు. ముఖ్యంగా యూఎస్-చైనా ట్రేడ్ వార్ ఫలితంగా ఇప్పటికే బంగారం ధరలు 20 శాతం పెరిగిపోయాయి. భవిష్యత్తులో పసిడి ధరలు అర లక్షకు చేరువైనా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







