సంగీత దర్శకుడిని కాపాడిన హీరో సాయి ధరమ్ తేజ్
- September 05, 2019
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్నారు. కళ్ల ముందే ఓ యాక్సిడెంట్.. మరో ఆలోచన లేకుండా మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు. సకాలంలో అతడికి వైద్యం అందేందుకు సాయపడి నిజమైన హీరో అనిపించుకున్నారు సాయి ధరమ్ తేజ్. నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకుని బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి వెళుతున్నారు . అంతలో రోడ్డు నెం.42 లోని ఓ మూలమలుపు దగ్గర బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి అటుగా వస్తున్న కారును ఢీకొట్టారు. దీంతో బైక్ పై నున్న వ్యక్తి సుమారు 10 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. కళ్ల ముందు జరిగిన ప్రమాదంతో హతాశుడైన సాయి ధరమ్ హుటాహుటిన కారు దిగి యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి దగ్గరకు వెళ్లారు. తరచి చూడగా తనకు తెలిసిన వాడేనని గుర్తించారు. అతడు యువ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి అని తెలుసుకున్నారు. మరో వ్యక్తి సాయంతో తేజ.. బాధితుడిని తన చేతులపై మోసుకొచ్చి తన కారులోనే.. సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో అచ్చు కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అచ్చు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..