సంగీత దర్శకుడిని కాపాడిన హీరో సాయి ధరమ్ తేజ్
- September 05, 2019మెగా హీరో సాయి ధరమ్ తేజ్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్నారు. కళ్ల ముందే ఓ యాక్సిడెంట్.. మరో ఆలోచన లేకుండా మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు. సకాలంలో అతడికి వైద్యం అందేందుకు సాయపడి నిజమైన హీరో అనిపించుకున్నారు సాయి ధరమ్ తేజ్. నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకుని బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి వెళుతున్నారు . అంతలో రోడ్డు నెం.42 లోని ఓ మూలమలుపు దగ్గర బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి అటుగా వస్తున్న కారును ఢీకొట్టారు. దీంతో బైక్ పై నున్న వ్యక్తి సుమారు 10 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. కళ్ల ముందు జరిగిన ప్రమాదంతో హతాశుడైన సాయి ధరమ్ హుటాహుటిన కారు దిగి యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి దగ్గరకు వెళ్లారు. తరచి చూడగా తనకు తెలిసిన వాడేనని గుర్తించారు. అతడు యువ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి అని తెలుసుకున్నారు. మరో వ్యక్తి సాయంతో తేజ.. బాధితుడిని తన చేతులపై మోసుకొచ్చి తన కారులోనే.. సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో అచ్చు కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అచ్చు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు