ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత రామ్ జఠ్మలానీ కన్నుమూత
- September 08, 2019
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత రామ్ జఠ్మలానీ(95) ఆయన నివాసంలో కన్నుమూశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా పనిచేశారు. ముంబయి నుంచి బీజేపీ అభ్యర్థిగా 6, 7 లోక్ సభలకు ఎన్నికయ్యారు. వాజ్పాయీ హయాంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కొనసాగుతున్న జఠ్మలానీ ఎన్నో వివాదాస్పద కేసులను వాదించారు. అరుణ్జైట్లీ - కేజ్రీవాల్ పరువునష్టం కేసులో కేజ్రీవాల్ తరపున వాదించారు. 1923 సెప్టెంబర్ 14వ తేదీన బాంబే ప్రెసిడెన్సీలో రామ్ జఠ్మాలనీ జన్మించారు. 17 ఏళ్ల వయస్సులోనే బాంబే యూనివర్సిటీలో ఎల్ఎస్బీ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శించారు. రామ్ జఠ్మాలనీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రామ్ జఠ్మాలాని మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







