తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా తమిళిసై కొత్త రికార్డు!
- September 08, 2019
తెలంగాణ నూతన గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 11 వందల మంది అతిథులు హాజరయ్యే ఈ కార్యక్రమం కోసం రాజ్భవన్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసేపట్లో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో బేగంపేట వస్తారు. సీఎంతో పాటు మంత్రులు ఆమెకు స్వాగతం పలుకుతారు. అనంతరం తమిళిసై రాజ్ భనవ్ చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ ఆమెతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా నియమితులై ప్రత్యేక గుర్తింపును పొందారు తమిళిసై సౌందరరాజన్. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి గవర్నర్ హోదా వరకు ఎదిగారు ఆమె. 1961 జూన్ 2న కన్యాకుమారి జిల్లా నాగర్కోయిల్లో ఆమె జన్మించారు. తల్లి కృష్ణ కుమారి, తండ్రి అనంతన్ . తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేతగానూ ఎంపీగానూ సేవలందించారు అనంతన్. తమిళిసై మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. పలు ఆసుపత్రులకు విజిటింగ్ కన్సల్టెంట్గా కూడా ఉండేవారు. తమిళిసై భర్త సౌందరరాజన్ కూడా వైద్యుడే.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







