లక్నోలో యూఏఈ సంస్థ లులు ఇన్వెస్ట్మెంట్
- January 08, 2016
యూఏఈ సంస్థ లులు, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోగల లక్నోలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 150 మిలియన్ డాలర్లు (550 మిలియన్ దిర్హామ్లు, అంటే వెయ్యి కోట్లు)తో లక్నోలో ఓ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ మరియు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనున్నట్లు 'లులు' గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ మా చెప్పారు. ఆగ్రామాలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు అలీ. యూపీలో తాము పెట్టబోడుతున్న పెట్టుబడుల ద్వారా 3000 కొత్త ఉద్యోగాల్ని సృష్టించనున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఉత్తరప్రదేశ్కి చెందిన 2000 మంది తమ సంస్థకు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారనీ చెప్పారాయన. పలు యూనివర్సిటీలనుంచి తనకు డాక్టరేట్ ఆఫర్లు వచ్చినా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ ఆఫర్ని మాత్రమే స్వీకరించాననీ, డాక్టరేట్ స్వీకరించిన తర్వాత, యూనివర్సిటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవసరాన్ని గుర్తించి, బాలికల కోసం 5, బాలుర కోసం 5 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం వెచ్చించానని అన్నారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, అలీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామనీ, ప్రభుత్వం తరఫున లులు సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రసాసీ దివస్ కార్యక్రమంలో చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









