లక్నోలో యూఏఈ సంస్థ లులు ఇన్వెస్ట్మెంట్
- January 08, 2016
యూఏఈ సంస్థ లులు, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోగల లక్నోలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 150 మిలియన్ డాలర్లు (550 మిలియన్ దిర్హామ్లు, అంటే వెయ్యి కోట్లు)తో లక్నోలో ఓ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ మరియు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనున్నట్లు 'లులు' గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ మా చెప్పారు. ఆగ్రామాలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు అలీ. యూపీలో తాము పెట్టబోడుతున్న పెట్టుబడుల ద్వారా 3000 కొత్త ఉద్యోగాల్ని సృష్టించనున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఉత్తరప్రదేశ్కి చెందిన 2000 మంది తమ సంస్థకు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారనీ చెప్పారాయన. పలు యూనివర్సిటీలనుంచి తనకు డాక్టరేట్ ఆఫర్లు వచ్చినా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ ఆఫర్ని మాత్రమే స్వీకరించాననీ, డాక్టరేట్ స్వీకరించిన తర్వాత, యూనివర్సిటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవసరాన్ని గుర్తించి, బాలికల కోసం 5, బాలుర కోసం 5 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం వెచ్చించానని అన్నారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, అలీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామనీ, ప్రభుత్వం తరఫున లులు సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రసాసీ దివస్ కార్యక్రమంలో చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







