తెలంగాణ జాగృతి ఖతార్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
- September 09, 2019తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే. అదే క్రమంలో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్వహించనున్న 'జానపద బతుకమ్మ' పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.కవిత మాట్లాడుతూ ఏ గడ్డపై ఉన్నా స్వీయ సంస్కృతి పై మక్కువతో, మాతృభూమి పై మమకారంతో మన సంస్కృతి ని పండుగలను ప్రవాస తెలంగాణీయులు జరుపుకుంటూ ఉండడం సంతోషకరమన్నారు. ఈ సారి జానపద కళాకారులకు పెద్దపీట వేస్తు కార్యక్రమం రూపొందించామని ఖతార్ తెలంగాణ జాగృతి శాఖ అధ్యక్షులు నందిని అబ్బగౌని అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీధర్ అబ్బాగౌని, అభిలాష్ బండి, ప్రశాంత్ పూస మరియు పావని గణేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ నిర్వహిస్తున్న 'జానపద బతుకమ్మ' అక్టోబర్ 4న దోహా ఖతార్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్, అశోక హాల్ లో సాయంత్రం 4గం.లకు ప్రారంభమవుతుందని నందిని అబ్బగోని తెలిపారు.
----రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు