స్ప్రింక్లర్ వ్యవస్థను వైఫై ఇంటర్నెట్తో
- January 09, 2016
ఒక్క రోజు నీరు రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. నీటి వృథాతో వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భవిష్యత్తు బాగుండాలంటే నీటిని ఆదా చేయాల్సిందే. దీన్ని గమనించిన అమెరికాలోని డెన్వర్కు చెందిన రషియో సంస్థ వైఫైతో నడిచే స్మార్ట్ స్ప్రింక్లర్ల వ్యవస్థను రూపొందించింది. ఇవి 30 శాతం నీటిని ఆదా చేయడం విశేషం. స్మార్ట్ఫోన్ సాయంతో ఈ వ్యవస్థను నియంత్రించవచ్చు. స్ప్రింక్లర్ వ్యవస్థను వైఫై ఇంటర్నెట్తో అనుసంధానిస్తారు. నియంత్రణకు సంబంధించిన యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేస్తారు. దీంతో ఇంటి వద్దనుంచే వీటిని నియంత్రణ సాధ్యమవుతుంది. దీని సాయంతో సీజన్ల వారీగా నీటిని విడుదల చేయవచ్చు. వాతావరణాన్ని పరిశీలించి వర్షం వస్తే దానంతట అదే ఆగిపోతుంది. భూమిలో నీరు ఇంకిన శాతం గమనిస్తుంది. ఆవిరి కాగానే మళ్లీ నీటిని విడుదల చేస్తుంది. 2012లో అమెరికాలోని కొలరాడోలో వచ్చిన కరవును చూసి చలించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు క్రిస్ క్లెయిన్, ఫ్రాన్జ్ గార్సోంబ్కేలు ఈ వ్యవస్థను రూపొందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







