హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది.. ఇకపై..
- September 18, 2019
హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది. ఆ ప్రాంతానికి కళ్యాణ కర్ణాటక అని కొత్త పేరు పెట్టారు. ఈ మేరకు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం ప్రకటించారు. బుధవారం నుంచి హైదరాబాద్-కర్ణాటక రీజియన్ను కళ్యాణ కర్ణాటక రీజియన్గా వ్యవహరించాలని సూచించారు. కళ్యాణ కర్నాటక రీజియన్లో ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కర్నాటకలో 6 రీజియన్లు ఉన్నాయి. బెంగళూరు, ఉత్తర కర్నాటక, కోస్తా కర్ణాటక, పాత మైసూరు, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలుగా విభజించారు. ఇందులో హైదరాబాద్-కర్ణాటక చాలా కీలకం. ఈ రీజియన్లో బీదర్, గుల్బర్గా, యాద్గిర్, రాయ్చూర్, కొప్పళ్, బళ్లారిలతో కూడిన ఈ ప్రాంతం ఒకప్పుడు నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. స్వాతంత్య్రానంతరం కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ ఈ ఆరు జిల్లాలను మాత్రం హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే పిలుస్తున్నారు. దశాబ్దాల ఆ పిలుపునకు యడియూరప్ప సర్కారు చరమగీతం పాడింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







