సూర్యుణ్ణి అధ్యయనం చేయనున్న ఆదిత్య-ఎల్1
- September 19, 2019
హైదరాబాద్: ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నది. సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని చేపట్టనున్నది. 2020లోగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇస్రో భావిస్తున్నది. దీనికి సంబంధించిన తుది తేదీలు ఇంకా వెల్లడికాలేదు. తొలిసారి భారత్ ఆదిత్య-ఎల్1 ద్వారా సూర్యుడిని స్టడీ చేయనున్నది. సుమారు 400 కేజీల బరువుతో శాటిలైట్ను తయారు చేస్తున్నారు. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పేలోడ్ను భూకక్ష్యలో ప్రవేశపెడుతారు. భూమికి సుమారు 15 లక్షల మైళ్ల దూరంలో ఉన్న లగ్రంగియన్ (ఎల్1) పాయింట్ వద్ద శాటిలైట్ను నిలుపనున్నారు. ఆదిత్య-ఎల్1తో సూర్యుడి బహ్యాప్రదేశాన్ని అధ్యయనం చేయనున్నారు. లక్షల డిగ్రీల కెల్విన్ల ఉష్ణోగ్రత ఉండే కరోనాను ఆదిత్య స్టడీ చేస్తుంది. సూర్యుడికి సంబంధించిన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లను కూడా ఆదిత్య అధ్యయనం చేయనున్నది. సౌర శాస్త్రానికి సంబంధించిన ఇంకా అనేక పరిశోధనలను ఆదిత్య చేపట్టనున్నది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







