అమెరికాలో మరోసారి కాల్పులు..
- September 20, 2019
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ డీసీలోని ఓ వీధిలో ఆగంతకుడు జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
కాల్పుల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాల్పుల్లో ఉగ్రవాద కోణంపై ఆరా తీస్తున్నారు. సమీప వీధులను ఖాళీ చేయించి దుండగుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో కాల్పులు స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి.
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!