హైదరాబాద్:నగల షోరూంలో దోపిడీకి స్కెచ్...
- September 23, 2019
హైదరాబాద్ శివార్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ గోల్డ్ షోరూంలో దోపిడీకి దొంగలు స్కెచ్ వేయగా.. దుండిగల్ ఎస్సై అడ్డుకున్నారు. స్పాట్కు వచ్చిన ఎస్సై శేఖర్రెడ్డిని.. తమ వెహికల్తో ఢీ కొట్టి.. హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. దొంగల బారి నుంచి దుండిగల్ ఎస్సై.. చాకచక్యంగా తప్పించుకున్నారు.
దోపిడీ దొంగలు తనపై హత్యాయత్నం చేసినా ఎస్సై శేఖర్రెడ్డి ఏమాత్రం భయపడలేదు. వెంటనే వారిని వెంబడించారు. సినీ ఫక్కీలో ఛేజింగ్ సీన్ జరిగింది. దొంగలు దూలపల్లి అడవుల్లోకి పారిపోయారు. వాళ్లు వాడిన వాహనం, కట్టర్, షట్టర్లు తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దోపిడీ దొంగలు వాడిన వాహనం.. ఆల్వాల్లో దొంగిలించినదిగా పోలీసులు గుర్తించారు. వాళ్లు అంతకుముందు.. రెండు ఏటీఎంలను దోచుకునేందుకు విఫల ప్రయత్నం చేశారని తేల్చారు. దూలపల్లి అటవీ ప్రాంతంలోకి పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







