గల్ఫ్కు దూరంగా వుండండి-ఇరాన్ అధ్యక్షుడు
- September 25, 2019
టెహ్రాన్ : పర్షియన్ గల్ఫ్కు పశ్చిమ దేశాలు దూరంగా వుండాలని, దాని భద్రతను ఇరాన్ నేతృత్వంలోని ఆ ప్రాంత దేశాలకు వదిలిపెట్టాలని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హితవు పలికారు. గల్ఫ్ ప్రాంతీయ జలాలలో అమెరికా నేతృత్వంలోని కూటమి పెట్రోలింగ్ కార్యకలాపాలు చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇరాన్ సైనిక సత్తాను ప్రపంచానికి చాటేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో కవాతులు నిర్వహించారు. రాజధాని టెహ్రాన్లో జరిగిన ప్రధాన కవాతులో రౌహాని రక్షణబలగాలనుద్దేశించి ప్రసంగిస్తూ ఐరాస ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశాలలో గల్ఫ్ శాంతి పునరుద్ధరణ కోసం రూపొందించిన ప్రణాళికను ప్రకటించనున్నట్లు చెప్పారు. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇటీవలి డ్రోన్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో రౌహానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో జరిగిన ఘటనలను ఇరాన్తో ముడిపెడుతున్న వారు గతంలో మాదిరిగానే అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







