సబ్జాలతో మేలు
- September 26, 2019
అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే సబ్జాను నీళ్లలో నానబెట్టి తాగండి. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయోటిక్ లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలనూ నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల తెల్లవారేసరికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్-2 మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాదు..దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ రాకుండా చూడడంతోపాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జా గింజలు పెట్టింది పేరు. ఇంకా ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోపాటు పీచునీ ఎక్కువగా కలిగివుంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్, నియాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ 'ఇ' ఉంటుంది. శరీరంలో పేరుకున్న వ్యర్ధాలను తొలగించడానికి ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరింకేం..ఇప్పుడే ఒక గ్లాసుడు సబ్జాలను నాబెట్టండి..
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







