సబ్జాలతో మేలు
- September 26, 2019
అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే సబ్జాను నీళ్లలో నానబెట్టి తాగండి. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయోటిక్ లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలనూ నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల తెల్లవారేసరికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్-2 మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాదు..దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ రాకుండా చూడడంతోపాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జా గింజలు పెట్టింది పేరు. ఇంకా ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోపాటు పీచునీ ఎక్కువగా కలిగివుంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్, నియాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ 'ఇ' ఉంటుంది. శరీరంలో పేరుకున్న వ్యర్ధాలను తొలగించడానికి ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరింకేం..ఇప్పుడే ఒక గ్లాసుడు సబ్జాలను నాబెట్టండి..
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!