చారిత్రాత్మక ఘట్టం: అంతరిక్షంలోకి యూఏఈ ఆస్ట్రోనాట్
- September 26, 2019అంతరిక్షంలోకి తొలిసారిగా యూఏఈకి చెందిన ఆస్ట్రోనాట్ దూసుకెళ్ళడాన్ని మొత్తం యూఏఈ సమాజం ఆసక్తిగా తిలకించింది. సోయుజ్ రాకెట్ ద్వారా అంతరిక్షం వైపు యూఏఈ ఆస్ట్రోనాట్ హజా అల్ మన్సూరి దూసుకెళ్ళారు. రాకెట్ లిఫ్ట్ ఆఫ్ వీడియోను యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ తన మొబైల్ ఫోన్లో ప్రత్యక్షంగా వీక్షించారు. సైక్లింగ్ చేస్తూ ఈ వీడియోను వీక్షించిన విషయాన్ని షేక్ మొహమ్మద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కజకిస్తాన్ నుంచి ఈ రాకెట్, అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. మాజీ ఫైటర్ జెట్ పైలట్ కుమారుడైన అల్ మన్సౌరి, అంతరిక్ష కేంద్రం వద్దకు వెళ్ళి, ఓ వారం రోజుల తర్వాత భూమికి చేరుకుంటారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ