చమురు ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం..సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరిక
- September 30, 2019
ఇరాన్తో ఉద్రిక్తతలు మరింత ముదిరితే చమురు ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉందని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ''ఇరాన్ దూకుడును అడ్డుకునేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉద్రికత్తలు మరింత ముదిరి అంతర్జాతీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. చమురు ధరలు జీవితకాల గరిష్ఠానికి చేరతాయి. ప్రపంచపు 30శాతం ఇంధన ఎగుమతులు, 20శాతం వాణిజ్య మార్గాలకు మిడిల్ ఈస్ట్ ప్రాంతం నెలవుగా ఉంది. ప్రపంచ జీడీపీలో నాలుగు శాతం ఇక్కడి నుంచే వస్తోంది. ఇవన్నీ ప్రభావితమవుతాయి. అంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది'' అని సీబీఎస్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో సౌదీ యువరాజు హెచ్చరించారు.
సౌదీలోని అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్కోకు చెందిన అబ్ఖైక్, ఖురైస్ శుద్ధి కేంద్రాలపై ఇరాన్తో సంబంధాలున్న హుతీ తిరుగుబాటుదారులు ఈ నెల ఆరంభంలో డ్రోన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ చమురు ఎగుమతుల్లో దాదాపు ఆరు శాతం ప్రభావితమయ్యాయి. ఈ దాడికి ఇరాన్ ప్రభుత్వమే కారణమని అమెరికా, సౌదీ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే సైనిక చర్యకు తాను ఏమాత్రం ఇష్టపడడం లేదని మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. శాంతియుత చర్చలకు తానెప్పుడూ సిద్ధమేనన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







