రచ్చగా మారిన 'సైరా' ప్రి రిలీజ్
- September 30, 2019
దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు ఎంతోమంది మహనీయులు పోరాడారని అటువంటి వారి చరిత్రతో సినిమా తీయాలనే కల సైరా నరసింహారె డ్డి ద్వారా తీరిందని కన్నడిగులు ఆశీర్వదించాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. సైరా నరసింహారెడ్డి ప్రిరిలీజ్ ఆదివారం రాత్రి బెంగళూరులోని మ్యాన్ఫో కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. చిరంజీవితోపాటు నిర్మాత, ఆయన తనయుడు రామ్చరణ్, హీరోయిన్ తమన్నా, దర్శకుడు సురేంద్రరెడ్డిలు పా ల్గొన్నారు. కన్నడ కంఠీరవ రాజ్కుమార్ న ట వారసుడు శివరాజ్కుమార్ ప్రత్యేక ఆ హ్వానితుడిగా విచ్చేశారు. మెగాస్టార్ అంటే కన్నడిగులకు ఎనలేని అభిమానం. చిరంజీవి రాక తెలుసుకుని వేలాదిమంది అభిమానులు మధ్యాహ్నానికే కన్వెన్షన్ సెం టర్కు చేరుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆ సంఖ్య మరింత పెరిగింది. అభిమానులను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ కన్నడ అంటే నాకెంతో ఇష్టమని రాజ్కుమార్ మాకు ఓ తండ్రిలాంటివారని తమ్ము డు శివరాజ్తో కలసి వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమరయోధుడి పాత్రలో మరికొన్ని గంటల్లోనే మీముందుకు వస్తున్నా... కన్నడ భాషలోనే వీక్షించండి...
మీ అభిమానంతోనే ఇంతటి వాడయ్యానన్నారు. రెండున్నరేళ్ళు సినిమాకోసం కష్టపడ్డాం... రాజీ లేకుండా సినిమా తీశాం... భారీ బడ్జెట్ కావడంతో వెనుకాముందూ ఆలోచనే లేకుం డా నా కొడుకు రామ్చరణ్ నిర్మాతగా ముం దుకొచ్చారన్నారు.
రూ.300 కోట్లు బడ్జెట్ అంటే ఆషామాషీ కాదు. అయినా ప్రజలకు సమరయోధుడి సందేశం ఇస్తున్నాననే సంతోషంగా ఉన్నానన్నారు. కన్నడతోపాటు హిందీ, తమిళ్లో కూడా సినిమా విడుదల అవుతోందన్నారు. దేశంలోనే లెజెండ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ పాత్ర సరిపోతుందని ఒక్కఫోన్ కాల్తోనే కాల్షీట్లు ఇచ్చారన్నారు. సినిమాకోసం రెండున్నరేళ్ళు ఎంతోమంది కష్టపడ్డారు. మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు. తొలుత కన్నడలో మాట్లాడిన చిరంజీవి అందరినీ ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







