సముద్రం నుంచి 3 టన్నుల వ్యర్ధాల తొలగింపు

- January 10, 2016 , by Maagulf
సముద్రం నుంచి 3 టన్నుల వ్యర్ధాల తొలగింపు


 
ఎన్విరాన్‌మెంట్ వలంటరీ ఫౌండేషన్‌కి చెందిన కువైట్‌ డైవ్‌ టీమ్‌ (కెడిటి)మూడు టన్నుల వ్యర్ధాల్ని అల్‌సులైబిఖాత్‌లోని ఆఫ్‌ షోర్‌ ప్రాంతాల్లో తొలగించింది. కెడిటి ఆపరేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ బాలిద్‌ అల్‌ షట్టి మాట్లాడుతూ ప్లాస్టిక్‌ బ్యాగులు, క్యాన్‌లు తీర ప్రాంత పర్యావరణానికి హాని కలిగిస్తాయనీ, పక్షులు, సముద్ర జీవుల మనుగడను ప్రశ్నార్దకం చేస్తాయని చెప్పారు. సముద్రంలో పర్యటించేవారు చెత్తని సముద్రంలో పారేయడం ద్వారా చెత్త పేరుకుపోతుందనీ, అది క్రమంగా తీరానికి చేరుతుందని ఆయన అన్నారు. కువైట్‌ మున్సిపాలిటీతో కలిసి కెడిటి టీమ్‌ ఈ క్లీనప్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. సముద్ర పర్యాటకులు, అలాగే సముద్రాల్లోకి వెళ్ళే నౌకలు, ఇతరత్రా పడవలు వంటివాటి ద్వారా చెత్త సముద్రంలోకి వెళ్లకుండా తగిన చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. నిబంధనల్ని ఉల్లంఘించినవారికి కఠిన శిక్షలు అమలు చేస్తే, సముద్ర పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని అల్‌షట్టి చెప్పారు. సముద్ర పర్యావరణాన్నీ, సముద్ర తీరాన్నీ పర్యవేక్షించగలిగితే సముద్ర జీవులు వృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com