సముద్రం నుంచి 3 టన్నుల వ్యర్ధాల తొలగింపు
- January 10, 2016
ఎన్విరాన్మెంట్ వలంటరీ ఫౌండేషన్కి చెందిన కువైట్ డైవ్ టీమ్ (కెడిటి)మూడు టన్నుల వ్యర్ధాల్ని అల్సులైబిఖాత్లోని ఆఫ్ షోర్ ప్రాంతాల్లో తొలగించింది. కెడిటి ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ బాలిద్ అల్ షట్టి మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగులు, క్యాన్లు తీర ప్రాంత పర్యావరణానికి హాని కలిగిస్తాయనీ, పక్షులు, సముద్ర జీవుల మనుగడను ప్రశ్నార్దకం చేస్తాయని చెప్పారు. సముద్రంలో పర్యటించేవారు చెత్తని సముద్రంలో పారేయడం ద్వారా చెత్త పేరుకుపోతుందనీ, అది క్రమంగా తీరానికి చేరుతుందని ఆయన అన్నారు. కువైట్ మున్సిపాలిటీతో కలిసి కెడిటి టీమ్ ఈ క్లీనప్ కార్యక్రమాన్ని చేపట్టింది. సముద్ర పర్యాటకులు, అలాగే సముద్రాల్లోకి వెళ్ళే నౌకలు, ఇతరత్రా పడవలు వంటివాటి ద్వారా చెత్త సముద్రంలోకి వెళ్లకుండా తగిన చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. నిబంధనల్ని ఉల్లంఘించినవారికి కఠిన శిక్షలు అమలు చేస్తే, సముద్ర పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని అల్షట్టి చెప్పారు. సముద్ర పర్యావరణాన్నీ, సముద్ర తీరాన్నీ పర్యవేక్షించగలిగితే సముద్ర జీవులు వృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







