ప.గో.జిల్లా.. ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ చేసిన మెగాస్టార్ చిరంజీవి
- October 06, 2019

గత సంవత్సరం నుంచి ఎస్వీ రంగారావు విగ్రహం ఆవిష్కరించాలని నన్ను కోరారు. అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. ఇన్నాళ్లకు నేను అభిమానించే ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం నా అదృష్టం. నా తండ్రి గారికి రంగారావు జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఎస్వీఆర్ లో అలవోకగా మాట్లాడటమే ఆయన ప్రత్యేకత. ఆయనను చూసే నాకు నటన పట్ల మక్కువ కలిగింది. నేను సినిమాల్లోకి రావడానికి ఆయనే స్ఫూర్తి. అటువంటి మహా నటుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. ఆయన నటనకు హద్దులు లేవు ఆయన అంతర్జాతీయ నటుడు. అలాంటి మహానుభావుడు విగ్రహం ఇక్కడ పెట్టడం ఆనందదాయకం.
నా జిల్లాకు వచ్చాను నన్ను ఆదరిస్తున్నారు, అక్కున చేర్చుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సైరా చిత్రాన్ని ఆదరించిన విజయం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేనొస్తున్నని తెలిసి ఎండను సైతం లెక్కచేయకుండా ఇక్కడకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రసంగించిన మెగాస్టార్ చిరంజీవి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







