ఇండియన్‌ గ్యారేజీ కార్మికులపై దాడి

- October 17, 2019 , by Maagulf
ఇండియన్‌ గ్యారేజీ కార్మికులపై దాడి

కువైట్‌: ఇద్దరు ఇండియన్‌ గ్యారేజీ వర్కర్స్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ మేరకు బాధిత గ్యారేజీ వర్కర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబు హలీఫా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు, నిందితుల్లో ఒకరు మిలిటరీ యూనిఫామ్‌ ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు రిపెయిర్‌ విషయమై తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. దాడికి సంబంధించి సిసిటీవీ కెమెరాలో అంతా రికార్డ్‌ అయి వుందని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com