ఉగ్రవాద క్యాంపులపై భారత ఎటాక్
- October 20, 2019
ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో భారత సైన్యం దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ లోని కశ్మీర్లో ఉగ్రవాదులపై దాడులు చేశారు. తంగ్ధార్ సెక్టార్కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఐదు మంది పాక్ సైనికులతో పాటు 10కి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
ఈ దాడిలో పాకిస్థాన్ ఆర్మీ క్యాంపులు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇందులో భారత్ ఆర్టిల్లరీ స్ట్రైక్స్ చేశాయి. అంటే ఫిరంగులు లాంటి వాటితో దాడి చేయగలిగాయి. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ ఉగ్రశిబిరాలపై తర్వాత సైన్యం చేసిన మరో కీలక ఆపరేషన్ ఇది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు భారత్ లోకి రానున్నారనే హెచ్చరికలతో భారత సైన్యం అప్రమత్తమైంది.
శనివారం అర్ధరాత్రి భారత దాడి ముగిస్తే.. దానికి బదులుగా ఆదివారం ఉదయం తంగ్ధార్ సెక్టార్ లో పాక్ సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాడులు పెరిగే అవకాశాలున్నట్లు భావించి అధికారులు అప్రమత్తమవుతున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







